Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా తక్కువుగా బయట కనిపిస్తుంటారు.. సినిమాల ముందు చేసే ప్రమోషన్స్ లో అయినా ఈయన తక్కువుగా మాట్లాడుతూ ఉంటారు.. అయితే అప్పుడప్పుడు మహేష్ బాబు రివీల్ చేసే విషయాలు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి.. మరి తాజాగా మహేష్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఈయన తాజాగా హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇదే వేదికపై ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడారు.. ఈయన మాట్లాడూతూ.. మీ అందరిలానే నేను కూడా మొబైల్ ఫోన్ ను ఎక్కువుగానే వాడుతాను.. ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ తో గడుపుతాను.. ఆ అలవాటును మానేయాలని అనుకుంటున్నాను..
అయితే తలనొప్పి ఎక్కువుగా వచ్చినప్పుడు ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంటా.. సాయంత్రం 6.30 తర్వాత నేను మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా.. నా గాడ్జెట్స్ అన్ని మా ఆవిడే తీసుకొస్తుంది.. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతాను.. కుటుంబంతో పర్యటనలకు వెళ్లడం, పిల్లలతో సరదాగా గడపడం ఇష్టం.. అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొద్దీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.