![TDP office Attack Case](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-10-13.jpg)
TDP office Attack Case : వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బుధవారం ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో గుంటూరుకు చెందిన వెంకట్ రెడ్డి, మస్తాన్వలె, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్ ఉన్నారు. 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడిచేసి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అప్పటి ప్రభుత్వం ఎవరినీ అరెస్టు చేయలేదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే దాడి చేసిన వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటోంది.
నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు వారి కోసం వెదుకుతున్నారు. ఆధారాలను సేకరించిన పోలీసులు పలువురిని రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిలో గుంటూరుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని పసిగట్టిన నిందితుల్లో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.