Nara Lokesh : పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. చంద్రబాబు కుటుంబం తిరుమల చేరుకొని గాయత్రి నిలయంలో బస చేసింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చంద్రబాబు కుటుంబం తిరుమలకు వచ్చిన సమయంలో, చంద్రబాబు బసచేసే అతిథి గృహం పక్కన పరదాలు కట్టారు. ఈ పరదాలను గమనించి మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు.
ఇక్కడ పరదాలు ఎందుకు కట్టారు? అంటూ లోకేష్ పోలీసులను అడిగారు. పక్కనే ఉన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అలవాటులో పొరపాటు అనగానే అక్కడున్న వారంతా నవ్వారు. మనకు పరదాలు అవసరం లేదని, ఇకనుంచి కట్టవద్దు అని పోలీసులకు లోకేష్ సూచించారు.