MLC by-Election
MLC by-Election : ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ బరిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), రాకేశ్ రెడ్డి (బీఆర్ఎస్), ప్రేమేంద్ర రెడ్డి (బీజేపీ) ఉన్నారు.