![Nilima Divi](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-10-13.jpg)
Nilima Divi : హైదరాబాద్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్ లో రూ. 80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొన్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్ కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ. 35 వేల వరకు ధరలు ఉన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు.