![CM Chandrababu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/IMG-20240616-WA0003.jpg)
CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలనపై ఫోకస్ పెట్టారు. కానీ ఇన్ని రోజులుగా పార్టీ అధికారానికి దూరంగా ఉండడంతో చాలా మంది నేతలు పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయింది. అయితే టీడీపీలో ఉండి టీడీపీయే సర్వస్వంగా పని చేసిన నాయకులు నామినేటేడ్ పదవులపై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా.. టీడీపీ నాయకులకు నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించాడు.
త్వరలోనే నాయకులకు నామినేటేడ్ పోస్టుల్లో నియమిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ అధినేత టీడీపీ భవన్ కు వచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన వారిని గుర్తించేందుకు అధ్యయనం ప్రారంభించామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో సమావేశంలో చర్చించారు. నామినేటేడ్ పదవులకు ఎవరెవరూ అర్హులనే విషయాన్ని నాయకులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ముఖ్యంగా ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడుని కూడా పక్కన పెట్టారు. మరో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావును కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకుండా పక్కనపెట్టారు. వీరే కాకుండా అనేక మంది పోటీ చేయాలనుకుని సీటు వదులుకున్న వారికి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ వారికి ఎంతో మందికి నామినేటేడ్ పదవులు ఇవ్వాల్సి ఉంది.
ముఖ్యంగా నామినేటేడ్ పదవులను ఆశిస్తున్న వారిలో పట్టాభి, పిఠాపురం వర్మ, నన్నపనేని రాజకుమారితో పాటు ప్రతి జిల్లాలో నలుగురు లేదా అయిదుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కనున్నాయోనని ఉత్కంఠ నెలకొంది. వైసీపీ లీడర్లను ఎదుర్కొని దాటిగా పని చేసిన వారికి గుర్తింపునిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో అలాంటి నేతలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఎవరిని ఎమ్మెల్సీలుగా.. ఎవరికీ కార్పొరేషర్ల చైర్మన్లుగా నియమిస్తారో చూడాలి.