![Kharge](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-3-19.jpg)
Kharge : పీఎం మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడతారు కానీ మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు, పెరుగుతున్న వాణిజ్య లోటుపై మోదీ ప్రభుత్వంపై సోమవారం ఆయన మాట్లాడారు. మోదీజీ తన అనేక ప్రసంగాలలో ఆర్థిక వ్యవస్థపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడరు అని ఖర్గే ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విఫలమైంది, పిఎల్ఐ పథకం అటకెక్కింది, ఎగుమతులు పడిపోయాయి అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్-యూపీఏ హయాంలో 2004 నుంచి 2010 వరకు 186.9 శాతం, 2009 నుంచి 2014 వరకు 94.39 శాతం ఎగుమతి వృద్ధి చెదింది. 2014 నుంచి 2020లో మోదీ-ఎన్డీయే హయాంలో 21.14 శాతం ఎగుమతులు వృద్ధి చెందాయని ఆయన తెలిపారు. గత ఏడాది భారత్ ఎగుమతులతో పోలిస్తే చైనా వస్తువుల దిగుమతుల మధ్య వ్యత్యాసం రూ. 7 లక్షల కోట్లు ఎక్కువని ఆయన వెల్లడించారు.