NRI’s Car Rally in New Jersey : ఎన్నారైలు కదం తొక్కారు.. జైస్వరాజ్య వరల్డ్ టీవీ మరియు జైఎస్.డబ్ల్యూ టీవీ, యూబ్లడ్ వారి ఆధ్వర్యంలో న్యూజెర్సీ ఎడిసన్ లో 300 మంది ఎన్నారైలు జైస్వరాజ్య వరల్డ్ టీవీ హెడ్ క్వార్టర్స్ నుంచి జాన్సన్ పార్క్ వరకూ ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇందులో 300 మంది ఎన్నారైలు ఎన్నో పనులు ఉన్నా..వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉన్నా కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాన్ ల విజయాన్నిర్యాలీగా సంబరంగా జరిపారు.
ఈ విజయోత్సవ ర్యాలీని యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. అమెరికాలో బడా పారిశ్రామికవేత్తలు, తెలుగు ఎన్నారైలు తమ విలువైన సమయాన్ని వెచ్చించి లక్షలు ఖర్చు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఎన్నారైలతో కలిసి జై గారు విజయ సంకేతం చూపించి ర్యాలీలో ఉత్సాహ పరిచారు.
అనంతరం డా.జై గారు ర్యాలీలో పాల్గొన్న ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు చాలా మంచి రోజని.. మోడీ, చంద్రబాబు, పవన్ సాధించిన విజయం అని.. టీడీపీ, బీజేపీ,జనసేనకు దక్కిన అఖండ విజయాన్ని స్వాగతిస్తున్నామని డా.జై గారు తెలిపారు. అధర్మం మీద ధర్మం గెలవడమంటే ఇదే అనిపిస్తోందని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఇచ్చిన అద్బుతమైనతీర్పు ఇది అని కొనియాడారు.
డా.జై గారితోపాటు పలువురు ప్రముఖ ఎన్నారైలు ఈ ర్యాలీలో ప్రసంగించారు.వారు ఏమన్నారో కింది వీడియోలో చూద్దాం..
ఈ కార్యక్రమంలో జగదీష్ యలమంచిలి గారు, దేవినేని లక్ష్మీ, రవి కొల్లి, రమేష్ రాయల, ఎన్నారై టీడీపీ లీడర్స్ శ్రీహరి మందాడి, రామకృష్ణ వాసిరెడ్డి, రాధాకృష్ణ నల్లమల్ల , జనసేన ఎన్నారై లీడర్స్ వెంకట్ సుధ, గోపీ గుర్రం, బీజేపీ ఎన్నారై లీడర్స్ రవి అంబటి తదతరులు పాల్గొన్నారు.