Pushpa 2 : ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి అయినా ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సెన్సేషనల్ హిట్లను సొంతం చేసుకుంటాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విజయాన్ని అందుకుంది.
దీనికి సీక్వెల్ గా పుష్ప రూల్ ను సుకుమార్ హై రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. దీంతో పుష్ప రూల్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇప్పటికే మూవీకి సంబంధించి టాకీ పార్ట్ పూర్తయింది. మిగతా కొన్ని షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. పుష్ప రూల్ నుంచి వచ్చిన ఓ పాట దేశ వ్యాప్తంగా ఊపేస్తోంది.
అల్లు అర్జున్, రష్మికా ఈ పాటకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ సీక్వెల్ కోసం సుకుమార్ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది. పుష్ప ది రైజ్ కంటే ఒక్క సీన్ కూడా తక్కువ కాకుండా చూపించేందుకు ట్రై చేశారని అర్థమవుతోంది. అల్లు అర్జున్, పహద్ పాజిల్ మధ్య జరిగే సీన్లు ఓ రేంజ్ లో ఉండనున్నాయని టాక్.
పుష్ప 2 మూవీలో శోభనం సీన్ కూడా ఉందంటా.. మొదటి భాగం పుష్ప పెళ్లితో ఎండ్ కార్డు పడగా.. పుష్ప 2 శోభనం సీన్ తో స్టార్ట్ కాబోతుందని టాక్. మరి ఈ సీన్ ను వేరే లెవల్ లో తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, పహద్ పాజిల్ కీలక రోల్స్ చేస్తుండగా.. మొదటి పార్ట్ లో చేసిన కేశవ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నాడు. కేశవ పాత్రను ఏ విధంగా మలిచారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆగస్టు 15న విడుదల కానున్న పుష్ప ది రూల్ ప్రేక్షకుల ను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి