![Kurchi Thatha](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/kurchi-thatha.jpg)
Kurchi Thatha : ‘గుంటూరు కారం’ సినిమాలోని ”కుర్చీని మడతపెట్టి ” అనే సాంగ్ జనాలను ఒక ఊపు ఊపేసింది. ఈ సాంగ్ కు స్టెప్పులేయని వారు లేరంటే అతిశయోక్తి లేదు. గుంటూరు కారంలో సినిమాలో ఈ పాటను పెట్టడానికి కారణం కుర్చీ తాత అన్న విషయం అందరికీ తెలిసిందే. కుర్చీతాత అసలు పేరు అహ్మద్ పాషా. కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఆయన అసలు పేరు అహ్మద్ పాషా.
కుర్చీతాతకు భార్య పిల్లలు ఉండగా.. ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా వాళ్లని తిడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆ తాత తిట్టే బూతుల్ని వైరల్ చేస్తూ అతడిని ఫేమస్ చేసేశారు. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన మూవీలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ను కంపోజ్ చేశారు. అహ్మద్ పాషా తాత డైలాగ్ అంతలా ఫేమస్ అయింది. ఈ పాటను వాడుకున్నందుకు తాతకు లక్ష రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు.
కుర్చీతాత తెలియని వారుండరూ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. ఈ మధ్య హిరోలు, హిరోయిన్ల పర్ఫామెన్స్ పై కూడా కుర్చీ తాత కామెంట్లు చేస్తున్నాడు. బన్నీ అల్లు అర్జున్ సినిమాల్లో యాక్టింగ్ చేసిందే చేస్తున్నాడని కొంచెం మార్పు రావాలని అల్లు అరవింద్ ను కోరుతున్నానని కుర్చీ తాత చెప్పాడు. దేవర సినిమా బాగా ఆడుతుందని చెప్పాడు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరు కత్తి పడితే చాలా బాగుంటుందన్నాడు. గేమ్ చేంజర్ సినిమాపై కూడా కామెంట్స్ చేశాడు.
వైజాగ్ సత్య అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన పేరును ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని వాడు కనిపిస్తే నరికేస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైజాగ్ సత్య పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఎన్టీఆర్ చాలా మంచోడని, ఆడపిల్లకు, అనాథలకు హెల్ప్ చేస్తాడని అతడి దేవర సినిమా 150 రోజులు ఆడుతుందని జోస్యం చెప్పాడు.