Yadamma Raju కామెడీ షోలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు యాదమ్మ రాజు. సద్దాంతో కలిసి ఆయన చేసే స్కిట్స్.. నెక్ట్స్ జనరేషన్ లోకి తీసుకెళ్తున్నట్లు అనిపించింది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారికి అప్ డేట్ వర్సన్ సద్దాం, యాదమ్మ రాజు అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఇటీవల యాదమ్మ రాజు బైక్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. అతని కుడికాలికి తీవ్రమైన గాయం అయ్యిందని అతని భార్య స్టెల్లా ఒక వీడియో ద్వారా తెలిపింది. కొన్ని రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న యాదమ్మ రాజు రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అదిరింది, జబర్దస్త్ షోలు ఆయన టాలెంట్ నిరూపించుకునేందుకు బెస్ట్ ప్లాట్ ఫార్మ్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సినిమాల్లో మంచి కామెడీ పాత్రలు చేస్తూ కమెడియన్ గా స్థిరపడ్డాడు.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు హీరోగా నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ రిలీజైంది. ఇందులో యాదమ్మ రాజు కీలక పాత్ర పోషించాడు. జూలై 29న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. యాక్సిడెంట్ తర్వాతనే యాదమ్మ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. యాక్సిండెంట్ విషయం తెలిసినా అసలు ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అన్న విషయాలు మాత్రం తెలియలేదు. ఈ విషయాలను ఆయనే ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. ఏం చెప్పాడంటే.
‘నేను చాయ్ తాగుదామని బయటకు వచ్చాను. అప్పుడు ఒక బైక్ స్కిడ్ అయ్యి నా కాలిమీది నుంచి వెళ్లింది. కుడికాలు వేలు పూర్తిగా తెగింది. అక్కడున్న వారు వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు.. తొడభాగంలోని చర్మం తీసి వేలిని అతికించారు. నొప్పి తట్టుకోలేకపోయేవాడిని. ప్రాణం పోయినట్లనిపించింది. ఈ సినిమాలో నేను కూడా భాగం అయ్యా. అందుకే ఈ ప్రమోషన్స్ వచ్చా. మూవీ యూనిట్ వద్దు అని వారించింది. ప్రమోషన్ కూడా నా బాధ్యత కాబట్టి వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు. యాదమ్మరాజుకు మూవీ పట్ల ఉన్న అభిమానంపై నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
ReplyForward
|