Rohit Sena Semis : రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో దూసుకెళ్తున్నది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, పాయింట్ల పట్టికలో టాప్ వన్ ప్లస్ లో గెలిచింది. ప్రస్తుతం ఇండియా 10 పాయింట్ల తో ఉంది. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న కివీస్ జట్టును కూడా ధర్మశాల మైదానంలో రోహిత్ సేన ఓడించింది. దీంతో ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో టాప్ 2కి చేరింది.
ఇక ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని జట్టుగా భారత్ నిలిచింది. ఇక రెండో స్థానంలో న్యూజిలాండ్, మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. ఇక టీమిండియా వద్ద ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. అయితే రోహిత్ సేన ఈ పాయింట్లతో సెమీస్ కు చేరుకోలేదు. టీమిండియా ఇంకో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి గెలిచినా టీమిండియా సెమీఫైనల్ కు చేరుకునే చాన్స్ ఉంటుంది. ఆరు మ్యాచులు గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు చేరుకునే చాన్స్ ఉంటుంది. దీంతో టీమిండియాకు సెమీఫైనల్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక టీమిండియాకు అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో, నవంబర్ 2న శ్రీలంకతో, నవంబర్ 5న దక్షిణాప్రికాతో, ఇక చివరగా నవంబర్ 12 నెదర్లాండ్స్ తో మ్యాచులు ఉన్నాయి. ఇక ఈ నాలుగు జట్ల మీద టీమిండియా విజయం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం ఆయా జట్ల ఫామ్ చూసుకుంటే టీమిండియానే మెరుగ్గా ఉంది. ఇక రోహిత్ సేన సెమీస్ కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తు్న్నది. భారత్ తో పాటు కివీస్ జట్టు కూడా సెమీస్ చేరుకోవడం ఖాయమని అర్థమవుతున్నది. మరి మిగతా రెండు జట్లేవో త్వరలోనే తేలనుంది.