![CM Revanth](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-15-1.jpg)
CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త చూసి సీఎం స్పందించారు.
మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పరిమళించిన మానవత్వం తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికీ కాన్పు చేసిన టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయమన్నారు. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లనే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మానవత్వం చాటుకోవడంలో ఆర్టీసీ ముందుంటుందని సిబ్బంది మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు.
ఊరు వెళ్లడానికి వచ్చిన ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వాహనం వచ్చే లూపే సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్దను ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.