![Alluri District](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-3-11.jpg)
Alluri District : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం పెదబాయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వందేళ్లు నిండిన మాజీ ఎంపీపీని ఎత్తుకున్నారు. పెదబయలు మండలంలోని మారుమూల గ్రామాల్లో పర్యటన సందర్భంగా జామిగూడ పంచాయతీ గుంజివాడకు వెళ్లారు.
ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జర్సింగి బాలంనాయుడికి కొద్ది నెలల కిందటే వందేళ్లు పూర్తయ్యాయని తెలుసుకున్నారు. ఆయనను పిలపించుకొన్న కలెక్టర్ దినేష్ కొంతసేపు ముచ్చటించారు. అంతేగాక బాలంనాయుడిని ఎత్తుకొని అభినందించారు. ఇన్నేళ్లు ప్రజా జీవితంలో ఉండి మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.