![Why did Sharmila join the Congress?](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/maxresdefault-134.jpg)
YS Sharmila :
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కుట్ర దాగుందని వైఎస్ కుటుంబ సభ్యులు అప్పట్లో ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా పోయింది. మొత్తం క్లీన్ స్వీప్ అయింది. దీంతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.
తరువాత వైఎస్ కూతురు షర్మిల సైతం వైఎస్సార్ పార్టీ అంటూ తెలంగాణలో అధికారం కోసం కొన్నాళ్లుగా పోరాటం చేసింది. చివరకు మళ్లీ కాంగ్రెస్ లోనే కలిపింది. దీంతో ఆనాడు వైఎస్ ఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో శ్రీక్రిష్ణుడు ఇప్పుడు నిక్రిష్టుడు అయినట్లు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని తిట్టిన షర్మిల అదే పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన తండ్రి మరణానికి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీయే కారణమని అన్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీయే బాధ్యుడని నమ్మారు. ఇలా పలు రకాల ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు అందులోనే తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. అప్పుడేమో బండబూతులు ఇప్పుడేమో నీతి సూక్తులు. ఏది జరిగినా రాజకీయాల్లో సాధ్యమే.
తండ్రి మరణాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రాపకం పొందారు. ఇప్పుడు మళ్లీ అదే పార్టీని నమ్ముకున్నారు. ఇదేమి చిత్రం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు షర్మిల చేస్తుంది కూడా అదే. రాజకీయాల్లో గుర్తింపు రావాలంటే ఏదో పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ReplyForward
|