![104 Employee Protest](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-8-28.jpg)
104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు తనపై కక్ష పెంచుకుని ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ 104 అంబులెన్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శంకర్ అరగుండు, అరమీసంతో వినూత్న నిరసన తెలిపారు. ఇల్లందులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిపడా నిధులున్నా 104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఆపారని, దీనికి తోడు డీఎంహెచ్ఓ శిరీష మరో కుంభకోణానికి పాల్పడగా దాన్ని వెలికితీసి ఆ నిధులు ఆమె తిరిగి జమ చేసేలా చూశానని అన్నారు.
2008 నుంచి విధులు నిర్వహిస్తూ, యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నానని, జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తే తనపై కలెక్టర్ కు కంప్లయింట్ ఇచ్చి ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయించారని బాధితుడు శంకర్ వాపోయారు. హెల్త కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీఎంహెచ్ వో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.