అమెరికాలో వేములవాడ యువకుడు కంటె యశ్వంత్ ( 25) మరణించాడు. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన కొడుకు శవమయ్యాడని తెలుసుకొని తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ 8 నెలల క్రితమే అమెరికాకు వెళ్ళాడు.
అయితే వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి ఐర్లాండ్ దీవులకు వెళ్ళాడు. అక్కడ ఓ ప్రైవేట్ బోట్ తీసుకొని దీవులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో అలల ధాటికి యశ్వంత్ కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు ఎంతగా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే యశ్వంత్ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. ఐర్లాండ్ దీవుల్లో వెతుకగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని ఇండియాకు తరలించే పనుల్లో ఉన్నారు.