![MI Vs LSG](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/lsg-vs-mi2.jpg)
MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో జరిగిన మ్యాచ్ లో లక్నో టీం ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో 214 పరుగులతో ఇన్సింగ్స్ ముగించింది. 8 సిక్సులు 5 ఫోర్లతో చెలరేగిన లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ 29 బంతుల్లోనే 75 పరుగులు చేసి లక్నో భారీ స్కోరు చేసేందుకు సాయపడ్డాడు.
లక్నో కెప్టెన్ కూడా 55 పరుగులతో రాణించాడు. ఆఖర్లో ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును 214 కు చేర్చారు. ముంబయి బౌలర్లలో నువాష్ తుషారా, పీయూష్ చావ్లా ఇద్దరు చెరో మూడు వికెట్లు తీయగా మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్జున్ టెండూల్కర్ ను ఈ మ్యాచ్ లో ఆడించారు.
అనంతరం ఛేదనకు దిగిన ముంబయికి రోహిత్ శర్మ, డేవిల్డ్ బ్రేవిస్ ఇద్దరు 88 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. 88/1 తో పటిష్టంగా ఉన్న ముంబయి 97/3 తో రోహిత్ శర్మ కూడా వెనుదిరగ్గా.. 120 పరుగులకే సగం బ్యాటర్లు పెవిలియన్ చేరగా.. మరోసారి మిడిలార్డర్ వైఫల్యం బయటపడింది. చివర్లో నమన్ దిర్ సిక్సులు, ఫోర్లతో చెలరేగి 28 బంతుల్లోనే 68 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయకపోవడంతో ముంబయి ఓడిపోక తప్పలేదు.
సూర్య కుమార్ డకౌట్ కావడం, ఇషాన్ కిషన్ స్పీడ్ గా ఆడకపోవడంతో ముంబయి కి ఓటమికి తప్పలేదు. లక్నో టీంకు 14 పాయింట్లు వచ్చినా.. ఆ టీంకు మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో ఈ సీజన్ లో ఎలిమినేట్ కాక తప్పలేదు. 14 పాయింట్లతోనే ఉన్న చెన్నై, ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఒకే ఒక్క బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. 14 పాయింట్లతో ఉన్న ఢిల్లీ, లక్నో ఎలిమినేట్ కాగా.. 14 పాయింట్లే ఉన్న చెన్నై పోటీలో నిలిచింది.