Jamili Elections :
కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లానుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన నేపథ్యంలో జనవరిలో ఆ దిశగా ఎన్నికల కసరత్తు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఏపీ ఎన్నికలు కూడా ఉంటాయి. అయితే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే ఒక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది.
ఇక ఒడిశాలో బీజేడీ తరఫున నవీన్ పట్నాయక్ ఇందుకు ఒప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తున్నది. ఇక ఏపీ సీఎం జగన్ కూడా ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయం కనుక ఆయన కాదనరనే సమాచారం వినిపిస్తున్నది. ఎందుకంటే కాదంటే ఎదురయ్యే పరిణామాలు ఆయనకు పక్కాగా తెలుసు. ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా జమిలి ఎన్నికలకు సై అంటున్నారు. అయితే కొంత కంగారే ఉన్నా, కేంద్రం సహకరిస్తే మాకు ఎదురుండదని భావిస్తున్నారు. కేంద్రం సహకారంతో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ భావిస్తున్నది. ఏదేమైనా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తీసుకునే నిర్ణయంపైనే అందరి చూపు ఉంది.
ఏపీలో వైసీపీ గెలవాలంటే టీడీడీకి అన్ని రూట్లు మూసివేయాలి. అక్కడ చంద్రబాబును తట్టుకోవడం చాలా కష్టం. గత ఎన్నికల్లో పని చేసిన ఒక్క చాన్స ఇప్పుడు అస్సలు పని చేయదు. వివేకా హత్య, కొడి కత్తి లాంటి సున్నిత అంశాలు ఇప్పుడు పనిచేయవు. ఇప్పుడు అన్ని రకాలుగా టీడీపీని లాక్ చేస్తేనే వైసీపీ కి గెలుపు ఎదురవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎన్నికల్లో కేంద్రం సహకారం అవసరం. వారు చెప్పిన దానికి తలూపితేనే లాభం ఉంటుంది. మరి సీఎం జగన్ అందులో కాదనలేని పరిస్థితి. లేదంటే కేసుల కత్తి మెడ మీద ఉండనే ఉంది. ఏదేమైనా ఈసారి ఏపీ ఓటరు తీసుకునే ఓటు నిర్ణయం పైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంది.