– ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
![Road Accident](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-8-6-1.jpg)
Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అనంతపురం రాణి నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు పెళ్లి బట్టల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ అనంతరం తిరిగి అనంతపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నారు.