![Shock For Kalki](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/kalki.webp)
Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొడుతోంది. ఇక బాలీవుడ్ లోనైతే ఈ సినిమాకు విపరీతమైన బజ్ వచ్చేసింది. మల్టీప్లెక్స్ ల్లో ఒక్కో టికెట్ రెండు వేలకు పైగా పలుకుతోందట. ఇక ఏపీ, తెలంగాణలో పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ తెరిచిన నిమిషాల్లోనే అయిపోయాయి.
ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతుండడంతో ఆయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా ఆసక్తి నెలకొంటోంది. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ వందల కోట్లలో బడ్జెట్ లో ఉండడం విశేషం. ఇక సలార్ మూవీ తర్వాత వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్ , దీపికా పడుకునే వంటి స్టార్లు ఎంతో మంది ఉండడంతో సినిమాకు ఊహకందని మార్కెట్ నడిచింది.
‘కల్కి 2898 ఏడీ’కి ఉన్న క్రేజ్ ను చూసి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అమలులో ఉన్న టికెట్ రేట్లను సింగిల్ స్క్రీన్స్ లో 100, మల్టీప్లెక్స్ లో 75 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో మూవీ యూనిట్, బయ్యర్లు ఫులీ ఖుషీ అవుతున్నారు. అయితే వారి సంతోషం ఎంతో సేపు నిలువకుండా ఓ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఏపీలో ‘కల్కి’ సినిమాకు టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ నమోదైంది. టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పిటీషనర్లు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.