Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు ఒకే చోట దాదాపు 22 కాయలు కాసింది. ఈ వింత కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో జరిగింది.
గ్రామానికి చెందిన కర్ర మోహన్ రెడ్డి మామిడి తోటలో గత ఏడాది ఈదురుగాలులకు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టు ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఇక ఆ చెట్టు కాత కాయదని అందరూ అనుకున్నారు. కానీ ఆ చెట్టు ఒకేచోట 50 కాయల వరకు కాసింది.
పూర్తిగా ఎండిపోతుందనుకున్న మామిడిచెట్టు కాసిన కాయలను చూసి రైతు కర్ర మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.