Activists Tension For KCR : తెలంగాణలో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కు అస్సలు కలిసిరావడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్ట్ లోనే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ప్రచారంలో అందరికంటే ముందే ఉండాలి ప్లాన్ వేశారు. కానీ సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో పార్టీలోని చాలా మంది ఆశావహులు నిరసనతో ఉన్నారు. కొన్ని రోజులు ఓపిక పట్టిన నాయకులు కాంగ్రెస్, బీజీపీల్లోకి వలస వెళ్లారు. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ దక్కని నేతలు కూడా బీఆర్ఎస్ లోకి వచ్చారు. వారికి సముచిత పదవులు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు మరో చిక్కు ఎదురైంది.
తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసులువు బాసారు.. మరెందరో కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి న్యాయం చేస్తామని కేసీఆర్ ఎప్పుడూ హామీ ఇస్తూనే ఉన్నాడు. ఆయన సీఎంగా పదేళ్లు తెలంగాణను పాలించారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వల్లే సాధ్యమైందని భావించి భారీ మెజారిటీతో కేసీఆర్ కు పట్టం కట్టారు. ఆ తర్వాత సరైన అభ్యర్థులను ఇతర పార్టీలు నిలబెట్టకపోవడంతో కేసీఆర్ మరో సారి సీఎం కుర్చీ ఎక్కారు. రెండు సార్లు కూడా సముచిత న్యాయం చేస్తామని ఉద్యమ కారుల కుటుంబాలకు చెప్పి తప్పించుకుంటున్నాడని విమర్శలుు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఈ సారి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ను గెలువనిచ్చేది లేదని ఉద్యమాకారుల ఐక్యవేదిక తరుఫున హెచ్చరిస్తున్నారు. ఐక్య వేధిక రాష్ట్ర అధ్యక్షుడు రాఘుమారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం (అక్టోబర్ 27) పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసిన ఉద్యమకారులు కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తామని హెచ్చిరించారు. గజ్వేల్, సిద్ధిపేట, కామారెడ్డి, సిరిసిల్లల్లో వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరి ప్రకటనతో కేసీఆర్ కు దడ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ గెలుస్తుందన్న వస్తున్న సర్వేలు.. వీరి హెచ్చరికల నేపథ్యలో ఆందోళనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.