
Revanth Fans Meet in Washington DC : సీఎం రేవంత్ రెడ్డి ముప్పై రోజుల ప్రజాపాలన భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, జన రంజకమైన పాలనతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమెరికా డిసి లోని రేవంత్ రెడ్డి అభిమానులు ఆకాంక్షించారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ, ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ హోటల్లో పోచంపల్లి తిరుపతి రెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అభిమా నులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి సుమారు మూడు వందల మందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.
మూడు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది సోదరులు ఎనుముల జగదీశ్ రెడ్డితో పాటు, పోచంపల్లి తిరుపతిరెడ్డి, కొండా రాంమోహన్ రెడ్డి, గొలుగూరి మూర్తిరెడ్డి, బొందుగుల జగదీశ్ రెడ్డి, మాదవరం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.