American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ప్రదర్శనలు, మరోవైపు అరెస్టులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు ఆగడం లేదు. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులతో చర్చలు జరుపుతున్నాయి. మరికొన్ని మాత్రం పోలీసులను రంగంలోకి దింపి అరెస్టులు చేయిస్తున్నాయి. గురువారి ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూరులో జన్మించిన అచింత్య శివలింగన్ ప్రిన్స్ టన్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. మరో విద్యార్థి హసన్ సయ్యద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు వీరిద్దరినీ యూనివర్సిటీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్ లో 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనెక్టకట్ యూనివర్సిటీలో గుడారాలను కూల్చివేశారు. ఓహోయో యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థతి నెలకొని ఉంది. జార్జి వాషింగ్టన్ యూనావర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో విద్యార్థులతో పాటు ప్రోఫెసర్లు పాల్గొన్నారు. అమెరికా వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో వారం రోజుల్లో సుమారు 550 మంది విద్యార్థులు అరెస్టయినట్లు అక్కడి మీడియా తెలిపింది.