Mokshagna సినీ ఇండస్ట్రీలో అప్పటికే స్టార్స్ గా ఉన్న వారి వారసులుగా సినీ ఎంట్రీ ఇవ్వడం ఈజీనే.. ఇప్పటికే సినీ పరిశ్రమలో దర్శకులు, హీరోలు, నిర్మాతలుగా ఉన్న వారి పిల్లలను తమ వారసులుగా లాంచ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.. అయితే అందరికి అంత అదృష్టం ఉండదు.. కొంతమంది టాప్ హీరోలుగా రాణిస్తుండగా మరికొంత మంది స్ట్రగుల్స్ పేస్ చేస్తున్నారు.
మరికొంత మంది అయితే ఇండస్ట్రీ నుండే కనుమరుగు అయ్యారు. మరి తాజాగా సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఇద్దరు వారసులు ఒకే హీరోయిన్ పై కన్నేశారని ఆమెనే కావాలని కోరుకుంటున్నారు అని టాక్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ వారసులు ఎవరు? చూద్దాం..
ఆ ఇద్దరు వారసులు ఎవరంటే.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ.. మరొకరు ఎన్టీఆర్ బావమరిది. ఇద్దరు ఒకే కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నారు. త్వరలోనే వీరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మోక్షజ్ఞ మూవీ ఇంకా ఫైనల్ కాలేదు.. ఎన్టీఆర్ బావమరిది నితిన్ మొదటి సినిమా మాత్రం పూర్తి అయ్యింది.. శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
నెక్స్ట్ మూవీ కోసం నితిన్ భారీ ప్లాన్ వేసాడు. ఈసారి పాన్ ఇండియన్ లెవల్లో మూవీ ఉండబోతుంది అని గీతా ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం.. అల్లు అరవింద్ కూడా ఈ యంగ్ హీరో కోసం టాప్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నారని టాక్.. అయితే ఇతడు తన సినిమాలో శ్రీలీల మాత్రమే కావాలని ఫిక్స్ అయ్యాడట.. మరో వైపు మోక్షజ్ఞ కూడా ఈ భామనే కావాలని బాలయ్య ఈమెను ఫిక్స్ కూడా చేసాడని టాక్.. అలా రాబోయే వారసులు ఇద్దరు శ్రీలీల కావాలని రెడీగా ఉన్నారు.