CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేడు కొంతమంది ప్రముఖ వ్యక్తులు బొకే ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. అధికా రం చేపట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ముగిశా క రేవంత్ రెడ్డి తో అనుబంధం ఉన్న నాయకులు ఆయన దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజే స్తున్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. అనంతపురం జిల్లా హిం దూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతనంగా ప్రభు త్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి సారి గా బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి శుభా కాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి గతంలో తె లుగు దేశం పార్టీ నేత గా కొనసా గారు. అప్పటి నుంచి బాలకృష్ణకు రేవంత్ రెడ్డికి మధ్య మంచి స్నేహం ఉంది.