Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డిసీపి రాధ కిషన్, సీఐ గట్టు మల్లుపై ఆరోపణలు రావడం తో వారిని అదుపులో కి తీసుకొని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారిస్తు న్నారు.
వెస్ట్ జోన్ డీసీపీ సమక్షంలో స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతన్న, భుజంగ రావు, ప్రణీత్ రావులకు రిమాండ్ విధించారు..
మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజు కో విషయం బయటకు వస్తుంది. ఈ కేసులో ఇప్ప టికే కొంతమంది పోలీసు అధికారులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో మరి కొంతమంది కూడా బయటపడే అవకాశం కనబడుతోంది.