Betting in AP : ఏపీలో ఎన్నికలు ముగిసి అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. జనాల్లో ఉన్న ఈ ఉత్కంఠను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు జోరుగా వ్యాపారం నడిపిస్తున్నారు. కోట్లాది రూపాయల బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం. అయితే బెట్టింగ్ రాయుళ్లు ఎవరూ కూడా వైసీపీని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదట.
అంతా కూటమే గెలుస్తుందని బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపుతుండడంతో వైసీపీ సైడ్ నుంచి బెట్టింగ్ కాసేవాళ్లు ఎవరూ లేరట. దీంతో బెట్టింగ్ రాయుళ్లు తమ ప్లాన్ మార్చేసి..వైసీపీ గెలుస్తుందా? కూటమి గెలుస్తుందా? అనే అంశాలను పక్కనపెట్టి అభ్యర్థుల మెజార్టీ విషయంలో బెట్టింగ్ కు దిగుతున్నారు. వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ఆశిస్తున్న చోట కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని పందెం కాసేందుకు ఎవరు ముందుకురావడం లేదని తెలుస్తోంది. ఒక్క జగన్ తప్ప మిగతా గెలిచేవాళ్లంతా 10వేల మెజార్టీకి లోపే గెలుస్తారని పందెం కడుతున్నారట.
ఇక టీడీపీ కూటమి నుంచి చంద్రబాబు 50వేల మెజార్టీతో, పవన్ 40వేల నుంచి 47వేల వరకు, లోకేశ్ 35వేల నుంచి 42వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఎక్కువ మంది బెట్టింగులు కడుతున్నారు. టీడీపీ కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లోనూ మెజార్టీపై ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తుండగా..వైసీపీ అభ్యర్థుల మెజార్టీపై నామమాత్రపు బెట్టింగే నడుస్తోందట. ఇక వైసీపీ అభ్యర్థుల్లో రోజా, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ, అంబటి, జోగి రమేశ్ స్థానాల్లో వీరి ప్రత్యర్థులు గెలుస్తారనే ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నారట. అసలు వీరు గెలుస్తారని ఒక్కరు కూడా బెట్టింగ్ కాయకపోవడంతో వీరు ఓడిపోయే బ్యాచ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.