![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/753388202_bigg-boss-telugu-7-to-begin-from-this-date-heres-when-and-where-you-can-watch-the-reality-show-1_202307-3.jpg)
బిగ్ బాస్ షో ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. అయితే ఒక్కో సీజన్ లో డేంజరస్ కంటెస్టెంట్ గా ఎవరో ఒకరు నిలుస్తారు. మరి ఈసారి అట్టహాసంగా స్టార్ట్ అయిన సీజన్ 7లో కూడా ఒక కంటెస్టెంట్ మోస్ట్ డేంజరస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.. మరి ఆ భామ ఎవరో బిగ్ బాస్ చూస్తున్న ఆడియెన్స్ కు ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది..
ఆమె ఎవరో కాదు.. రతికా రాజ్.. ఈమె గేమ్ స్ట్రాటజీలు చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. హౌస్ లో ఎప్పుడు ఎలా వ్యవహరించి వారితో పులిహోర కలపాలో ఈమెకు తెలిసినంత మరొకరికి తెలియదు అనేంతగా రాణిస్తుంది. ముందుగా రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ను తానే వెళ్లి పులిహోర కలిపి అతడిని కూడా ఆమె వైపుకు మొగ్గు చూపేలా చేసుకుంది.
కానీ చివరికి నామినేషన్స్ సమయంలో దారుణంగా అతడికి వెనుపాటు పొడిచింది.. ఇక్కడకు వచ్చి ఏం పీకుతున్నావ్? అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.. ఇతడిని మిగిలిన కంటెస్టెంట్స్ కూడా టార్గెట్ చేయడంతో అతడు ఆత్మవిశ్వాసం కోల్పోయి డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ప్రిన్స్ యావర్ ను రతికా రాజ్ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.
ఈమె వలపుల బాణాలకు, చురకత్తుల లాంటి చూపులకు, తీపి మాటలకూ కరిగిపోతున్నట్టే కనిపిస్తున్నాడు.. హౌస్ లో ఐ లవ్ యు యావర్ అని గట్టిగ చెప్పడంతో మనోడు దెబ్బకు ఫ్లాట్ అయిపోయి తెగ మెలికలు తిరిగిపోయాడు. దీంతో ఈమె నెక్స్ట్ టార్గెట్ ప్రిన్స్ అని ఇతడిని కూడా బకరాను చేయడం ఖాయం అని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ReplyForward
|