![Hyderabad News](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-16.jpg)
Hyderabad News : హైదరాబాద్ ఉప్పల్ లోని చిలకానగర్ లో ఓ ఇంటి యజమానిపై అపరిచితులు దాడికి పాల్పడడంతో కలకలం రేపుతోంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పిట్టల సుదర్శన్ (66) బిల్డింగ్ లో టూలెట్ బోర్డు చూసి ఇంట్లోకి వెళ్లిన యూపీకి చెందిన హిమాన్షి (23), గాంధీ (21)లు సుదర్శన్ ను ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అయితే వారు స్థానికులు కాకపోవడంతో అద్దెకు ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు.
పై అంతస్తులో ఉన్న రూంలకు తాళం వేసేందుకు సుదర్శన్ వెళ్లగా హిమాన్షి, గాంధీలు కూడా వెళ్లి సుదర్శన్ పై దాడి చేశారు. ముఖంపై స్ప్రే కొట్టే సమయంలో ఆయన గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి హిమాన్షి, గాంధీలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇంటి ఓనర్ పిట్టల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.