![Char Dham Yatra](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-1-2.jpg)
Char Dham Yatra : గుజరాత్ కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిలుపై చార్ ధామ్ యాత్ర చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె కృష్ణతో కలిసి ద్వారక, బద్రినాథ్ క్షేత్రాలను దర్శించుకున్న అశోక్ జీనాబాయ్ త్వరలో నేపాల్ లోని పశుపతినాథ్, రామేశ్వరంలోని శివుణ్ణి దర్శించుకోనున్నట్లు తెలిపారు. గుజరాత్ లో అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ, పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం ప్రార్థించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సైకిలుపై గుజరాత్ నుంచి బయలుదేరిన వీరు దాదాపు 1,400 కి.మీ. ప్రయాణించి ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు.
గుజరాత్ లో నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త నితిన్ జానీ కోసం చార్ ధామ్ యాత్ర చేపట్టినట్లు 8 ఏళ్ల కంగర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులకు నితిన్ జాననీ సహాయం చేస్తారని పేర్కొన్నారు. అందుకే చార్ ధామ్ యాత్రకు వెళ్లి నితిన్ జానీ కోసం ప్రార్థించాలని అనుకున్నానని, తాను కూడా భవిష్యత్తులో సమాజానికి సేవ చేస్తానని కంకర్ కృష్ణ అశోక్ భాయ్ తెలిపారు.