Mahesh Babu Sankranti Movies : పండుగల్లో ప్రత్యేకమైనది సంక్రాంతి. ఈ పండుగ కోసం ఇండస్ట్రీ ఏడాదంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే భారీ స్టార్ల సినిమాలను రిలీజ్ చేస్తుంది. ఇంగ్లిష్ కొత్త సంవత్సరం, 14 రోజుల్లోనే సంక్రాంతి వస్తుండడంతో సినిమాలకు కూడా బాగా గిరాకీ ఉంటుంది. కొత్త అల్లుళ్లు, కోడి పందేలు, బంధువులు ఇలా ప్రతీ ఒక్క ఆనందం సంక్రాంతితో ముడిపడి ఉంటుంది. అందుకే హీరోల నుంచి దర్శకులు, నిర్మాతలు కూడా సంక్రాంతికి థియేటర్లలో ఖర్చీఫ్ వేసుకొని మరీ ఎదురు చూస్తారు.
పండగ టైంలో రిలీజ్ చేస్తే కథలో లోటు పాట్లు ఉన్నా మినిమం వసూళ్లు వస్తాయని వారి ఆశ. ఆ సమయంలో పెద్దగా పోటీ లేకుంటే బాక్సాఫీస్ దక్కినట్లే. సూపర్ స్టార్ మహేశ్బాబుకు కూడా సంక్రాంతి అంటే సెంటిమెంట్. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో నిలిచిన మహేశ్ బాబు సినిమాలను పరిశీలిద్దాం.
టక్కరి దొంగ
మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా 12 జనవరి, 2002లో రిలీజ్ అయ్యింది. జయంత్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ మూవీలో లిసా రాయ్, బిపాసా బసు హీరోయిన్లుగా చేశారు. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా 5 నందులను గెలుచుకోవడం విశేషం.
ఒక్కడు
గుణశేఖర్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన చిత్రం ‘ఒక్కడు’. 2003 సంక్రాంతి బరిలో నిలచింది ఈ మూవీ. 2023, జనవరి 15న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో భూమిక హీరోయిన్గా చేయగా.. విలన్ గా ప్రకాశ్ రాజ్ మెప్పించాడు.
బిజినెస్మెన్
పోకిరి తర్వాత మహేశ్బాబు-పూరి కాంబోలో వచ్చిన మూవీ ‘బిజినెస్మెన్’. సంక్రాంతి కానుకగా 2012, జనవరి 13న రిలీజైంది. ఈ మూవీ కూడా పోకిరీలా భారీగా కలెక్షన్లను రాబట్టింది. మహేశ్ పంచ్ డైలాగ్స్కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మహేశ్ బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013, జనవరి 11న థియేట్రికల్ రిలీజైంది. ఇద్దరు హీరోలు ఒకే మూవీలో కనిపించడంతో ఫ్యాన్స్ కు సంక్రాంతి పండుగ ఉత్తేజం మరింత పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా 4 నందులను అందుకుంది.
‘1’ నేనొక్కడినే
మహేశ్ బాబు-సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా ‘1’ నేనొక్కడినే. హాలీవుడ్ కు ధీటుగా ఉండాలని సుకుమార్, మహేశ్ భారీ ప్రయోగం చేశారు. 2014, జనవరి 10వ తేదీ రిలీజైంది. కానీ ఇది తెలుగు ఆడియన్స్ ను ఏ మాత్రం ఎక్కలేదు. దీంతో డిజాస్టర్ గా నిలిచింది.
సరిలేరు నీకెవ్వరు
సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి-మహేశ్ బాబు కాంబోలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. అధిక వసూళ్లు రాబట్టింది. మహేశ్ ఖాతాలో ఈ మూవీ బ్లాక్బస్టర్ క్యూలో పడిపోయింది.
గుంటూరు కారం
ఈ ఏడాది (2024) కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు మహేశ్ బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’. ఈ మూవీ జనవరి 12వ తేదీ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కేవలం 2 రోజుల్లోనే రూ. 100 కోట్ల మైలురాయిని దాటింది. దీనికి వస్తున్న మిక్స్డ్ టాక్ లాంగ్ రన్లో ఈ మూవీ హిట్గా నిలుస్తుందో? లేదో చూడాలి!