Jagan : ఏపీలోని పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి వీలైనంతమేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరకు పాఠ్యపుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్ ప్రింటింగ్కు బకాయిలు పెట్టి.. ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకువచ్చింది.
Breaking News