![Suicide](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/08/225830-suicide.webp)
Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది. మూడు ముళ్లతో ఒక్కటైన దంపతులు పిల్లలను కని కుటుంబ వ్యవస్థకు జీవం పోసి. పిల్లలను పెంచి ప్రయోజకులను చేసి ఆ తర్వాత ఎక్కడి పక్షలు (పిల్లలు) అక్కడికి వెళ్లిపోయిన తర్వాత దంపతులిద్దరూ ఒకరి కోసం ఒకరు బతికేవారు. ఈ ఊహ ఎంత అందంగా ఉంటుందో కదా.. కానీ ఇప్పుడు కుటుంబాలు, కుటుంబ వ్యవస్థలు అలా లేవు.
కుటుంబాలు మొత్తం వివాహేతర సంబంధాలతో దరిద్రంగా మారుతున్నాయి. కొన్నేళ్లకు ముందు భర్తలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే భార్యలు పిల్లలను సాకుతూ ధు:ఖంతో కాలం వెళ్లేదీసేవారు. తర్వాత భార్త చేసిన తప్పును తెలుసుకొని కుటుంబంతో ఉండేవారు. ఆ సమయంలో హత్యలు, ఆత్మ హత్యలు జరగడం చాలా అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. వివాహేతర సంబంధం అంటేనే హత్య లేదంటే ఆత్మహత్య.
ఇప్పుడు వివాహేతర సంబంధాలకు ఎక్కువగా భార్యలు అలవాటవుతున్నారు. ఇది సమాజం నాశనానికి నాంది చెప్పవచ్చు. కోరికలు అందరికీ ఉంటాయి. ఒక్క మగవారికే కాదు. కానీ వంశాలు కలుషితం అవుతాయన్న విషయం మరవద్దు. పైగా భార్యలు వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ ఇంట్లో నుంచి ఒక్క శవమైనా వెళ్లిన ఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి భర్తను చంపించింది ఒక మహిళ, ఇది ఆదిలాబాద్ లో రీసెంట్ గా జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నవమాసాలు మోసి కన్న 8 సంవత్సరాల బిడ్డను కడతేర్చింది ఒక తల్లి, ఇది పటాన్ చెరు పరిధిలో జరిగింది. ఇలాంటిదే మరో ఘటన మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం కోటగడ గ్రామంలో జరిగింది.
వివాహం అనంతరం తన భర్తతో గొడవల కారణంగా తల్లిగారి ఇల్లు భువనగిరిలో ఉంటుంది రవళి. ఆ గ్రామానికే చెందిన రాఘవేందర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలియడంతో భర్త తరుఫు బంధువులు పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి మందలించారు. అయినా మాట వినని ఆమె సంబంధాన్ని కంటిన్యూ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి (జూన్ 16) ప్రియుడి ఇంట్లో సూసైడ్ చేసుకుంది. అది చూసిన రాఘవేందర్ కత్తితో పొడుచుకొని సూసైడ్ కు యత్నించాడు. కానీ ప్రస్తుతం గాయాలతో చికిత్స పొందుతున్నాడు.