Bhashyam Praveen : పెదకురుపాడు నియోజకవర్గంలో టిడిపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రచారాన్ని ముమ్మరం చేశా రు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం తుమ్మవరం, కాశిపాడు, బులు సుపాడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ గ్రామాల్లో ప్రతి వాడ వాడ తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను గురించి భాష్యం ప్రవీణ్ ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు మీ అందరికీ అందాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.
వైసిపి పాలనలో అభివృద్ధి జరగలేదని అందుకే ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని భాష్యం ప్రవీణ్ అన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి పరిస్థితి వచ్చిందన్నారు. గడచిన ఐదేళ్లలో ఒక కంపెనీ అన్న జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయాడని ఆయన ఆరోపించారు.
కంపెనీలో రావాలన్నా యువతకు ఉపాధి అవకాశా లు కావాలన్నా తెలుగుదేశం పార్టీ కూటమి అధి కారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాష్యం ప్రవీణ్ వెంట టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.