![press freedom](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/05/press-freedom.jpg)
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు నాలుగు స్థంబాలు. అందులో ఒకటి శాసన శాఖ కాగా..రెండోది కార్యనిర్వాహణ,న్యాయశాఖలు. ఇక ఈ మూడు విభాగాలు మాత్రమే కాదు..ప్రజాస్వామ్యంలోని నాలుగో స్థంబమే పత్రికలు,ప్రసార మాధ్యమాలు. వాస్తవానికి ఏ దేశంలోనైనా డెమోక్రసీ మూడు పువ్వులు ఆరు కాయాలుగా వర్ధిల్లాలంటే తప్పనిసరిగా ఆ దేశంలో పత్రికలు,ప్రసార మాధ్యమాలకు మంచి ఆదరణ ఉండాలి.
ఇందుకు గాను ఆయా దేశాల్లో ప్రభుత్వాలు పత్రికలకు పూర్తి స్వేచ్చనివ్వాలి. అప్పుడే డెమోక్రసీకి అర్థం పర్థం ఉంటుంది.కానీ,ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటున్న భారత్లో అలాంటి పరిస్థితులు లేవని ఓ అధ్యాయనం ద్వారా తేలింది. కొన్ని సూచికల ఆధారంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఆయా దేశాల్లో పత్రికా స్వేచ్చపై ఒక పట్టికను తయారు చేసింది. అందుకు సంబంధించిన ర్యాంకులను విడుదల చేసింది.
అయితే ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో భారత్కు అత్యంత ఎక్కువ ర్యాంకు రావడం శోచనీయం. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ వెల్లడించిన ర్యాగింగ్స్లో ఇండియాకు 140వ స్థానం దక్కింది. తాను వెల్లడించిన నివేదికలో భారత్లో పత్రికా స్వేచ్ఛకు చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని ప్రకటించింది. నాల్గవ స్థంభంగా చెప్పుకునే పత్రికలు,మీడియాకు మన దేశంలో విలువ లేదని వెల్లడించింది.
అయితే మన కన్న యూరప్,అమెరికా వంటి దేశాల్లో పత్రికా స్వేచ్ఛకు మంచి ఆదరణ ఉందని స్పష్టం చేసింది. మీడియాకు ఫ్రీడం ఇవ్వడంలో ఫిన్ల్యాండ్,ఐర్లాండ్,నెదర్