![IT Raids in Telangana](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/10/768-512-17125393-232-17125393-1670302506403.jpg)
IT Raids in Telangana : హైదరాబాద్ లో ఇటీవల రెండు కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఏఎంఆర్ కన్ స్ర్టక్షన్ లో జరిగిన సోదాల్లో రాజకీయ పార్టీల కోసం సిద్ధం చేసిన నగదు రూ. 150 కోట్లకు పైగా పట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ డబ్బు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వబోతున్నరానేది ఇంకా బయటకు రాలేదు. అయితే తాజా ఎన్నికల కోసమే ఈ నగదును సిద్ధం చేశారని ముందస్తు సమాచారం ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
అయితే ఈ కంపెనీలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివి. ఈ రెండు కంపెనీల యజమానులూ ఏపీకి చెందిన ప్రభుత్వ ముఖ్యుల సన్నిహితులవి. ఇందులో ఓ కంపెనీ కేవలం ఎన్నికలకు నిధులు సమకూర్చేందుకు మాత్త్రం నిర్వహిస్తున్నాడు. అక్రమ సొమ్మును ఆయా కంపెనీల్లోకి తరలించడం, ఆ తర్వాత రాజకీయ నేతలకు ఫండింగ్ చేయడమే వీరి పని. ఈ కంపెనీ ఏపీకి చెందిన ఓ రెడ్డివని తెలుస్తున్నది. ఏపీలో ఎన్నికల కోసం కూడా ఈ సొమ్మును సిద్ధం చేసినట్లు గా సమాచారం అందుతున్నది.
ఈ కంపెనీ యజమానిగా ఉన్న వ్యక్తి ఓ కీలక పదవిలో ఉన్నట్లు సమాయాకం. ఇక షర్మిల ఏపీలో రాజకీయం చేయకుండా ఈయనే మధ్యవర్తిత్వం నెరిపారని అంతా అనుకుంటున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీకి పెట్టుబడి పెట్టేందుకు కూడా సముఖత వ్యక్తం చేశాడని సమాచారం. ఏపీ ప్రభుత్వ ముఖ్యులతో ఉన్న సంబంధాల కారణంగానే ఆయన పేరు బయట పెట్టడం లేదని తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీకి నగదు సిద్ధం చేస్తున్న తరుణంలో ఇలా పట్టుబడడంతో వారి ఆశలకు గండి పడ్డాయి. సదరు పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది.