Gadchiroli Encounter : గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేక విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో తెలంగా ణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతి మదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
గడ్చిరోలి ఎన్కౌంటర్కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న గడ్చి రోలి లోని కొల్లమర్క అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ పేరిట తమ కామ్రేడ్లు మంగు వర్గేష్, రాజు, బు ద్రాం లను హత్య చేశారనీ ఆరోపించారు.
అన్నంలో విషం పెట్టి..
గడ్చిరోలిలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని తెలంగాణ ప్రభుత్వం తమ పోలీసుల ద్వారా జరిపించిందని జగన్ ఆలేఖలో ఆరోపించారు. ఆహార పదార్థాల్లో విషం పెట్టి వారు స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి క్రూరంగా హత్యచేశారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఎస్పీ ఈ పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు.
ఈ ఎన్కౌంటర్ నెత్తుటి మరకలు తమ చేతులకు అంటుకోకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్కౌం టర్లో వారు మరణించినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
ఈ ఘటన తర్వాత మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్బందీగా కొన సాగించేందుకు తెలంగాణ మహారాష్ట్రకు చెం దిన మంచిర్యాల భూపాలపల్లి గడ్చిరోలి జిల్లాల ఎస్పీ లతో సంయుక్త సమావేశం జరిపారని పేర్కొ న్నారు.