38.1 C
India
Saturday, May 11, 2024
More

    Panyam Constituency Review : నియోజకవర్గ రివ్యూ : పాణ్యంలో పాగావేసేదెవరు..?

    Date:

    who will be win in the panyam
    who will be win in the panyam

    Panyam Constituency Review :

    టీడీపీ : గౌరు చరితా రెడ్డి
    వైసీపీ : కాటసాని రాంభూపాల రెడ్డి (ప్రస్తుత ఎమ్మెల్యే)పాణ్యం.. గతంలో ఫాక్ష్యన్ రాజకీయాలకు కేంద్రం. ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రాం భూపాలరెడ్డి 8సార్లు పోటీ చేయగా, ఆరు సార్లు గెలిచారు. రెండు సార్లు టీడీపీ గెలిచింది. అయితే 2024 ఎన్నికలు పాణ్యంలో వేడిని పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం కాటసాని రాంభూపాల రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గౌరు చరిత మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వైసీపీ నుంచి యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

    గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాణ్యం పెట్టింది పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఇటీవల జరిగిన ఓ ఘటన భయాన్ని రేపింది. అయితే ఏడోసారి ఇక్కడి నుంచి గెలవాలని కాటసాని భావిస్తున్నారు. తద్వారా జగన్ దృష్టిలో పడి, మంత్రి పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కాటసాని రాంభూపాలరెడ్డి ఈసారి కూడా గెలవాలని అనుకుంటున్నారు. అయితే అభివృద్ధి విషయంలోనే తన ఆలోచన ఉందని చెబుతున్నారు.

    అయితే టీడీపీ కూడా 2024 ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి ఇక్కడి రాజకీయాలను చూసుకుంటున్నారు.  2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డి ఈ సారి పోటీకి సై అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఈ సారి గెలుపుపై దృష్టి పెట్టారు.  అయితే రెండు కుటుంబాలకు నియోజకవర్గంలో ఆదరణ బలంగా ఉంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా పాణ్యం కు పేరుంది. 2. 85 లక్షల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో ఎస్సీ ఓటర్లే ఎక్కువ. గ్రామీణ ప్రాంత ఓటర్లే ఇక్కడ కీలకం కానున్నారు. అయితే గతంలో ఉన్న భయం నీడలు ఇప్పుడు లేకపోయినా, ఈ ఛాయలు ఇంకా  పోలేదు. 2024 ఎన్నికల్లో ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీలో నిలబడుతుండగా, మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...