![Pawan Kalyan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-11-13.jpg)
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్న (బుధవారం) స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లను కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది.
రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని పవన్ నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారు. పిఠాపురంలో ఎకరం మార్కెట్ విలువ రూ.15 నుంచి 17 లక్షల వరకు ఉంది. మరో పది ఎకరాల భూమిని కొనేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.