Renu Desai Re Entry : పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. తన కొడుకు, కూతురును పెంచడంలో నిమగ్నమైన ఆమె రీ ఎంట్రీపై చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు, అప్పుడు అంటూ చాలా సార్లు దాట వేస్తూ వచ్చింది. పిల్లలు కూడా పెరగడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి వస్తే ఎలా ఉంటుందని భావించిన ఆమె రీ ఎంట్రీ కావాలని అనుకుంది.
దీనిలో భాగంగా గతంలో మరాఠీ ఇండస్ట్రీలోకి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో కూడా దర్శకురాలిగా ఫస్ట్ సినిమాను లాంచ్ చేయాలని ప్రయత్నించినా ఆమె ప్లాన్స్ కు బ్రేక్ పడింది. ఇది సాధ్యం కాదని నటనపై ఫోకస్ పెట్టింది.
మహేశ్ బాబు హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమాలో అవకాశం వస్తే రిజెక్ట్ చేసింది రేణు దేశాయ్. ఆ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె పాత్ర విషయంలో చిత్ర నిర్మాతలకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఆమె పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టమైంది.
ఆమె పాత్ర చుట్టే కథ ఉన్నప్పటికీ రేణు దేశాయ్ పాత్ర హేమలతకు స్క్రీన్ టైమ్ కు పరిమితం, ఆమె పాత్ర కథపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సినిమా ఫలితం ఆమెను ఆశ్చర్యపరిచి ఉండవచ్చు. ‘టైగర్ నాగేశ్వరరావు’ హిట్ అయి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె కెరీర్ పంథా మారిపోయేది కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది.