![RTC Staff Attack](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-9-5.jpg)
RTC Staff Attack : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ లో దారుణం జరిగింది. బస్సు ఎందుకు లేట్ వచ్చిందన్న ప్రయాణికుడిని ఆర్టీసీ సిబ్బందవి చితకబాదారు. షాద్ నగర్ బస్టాండ్ లో హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని ఓ ప్రయాణికుడు అడిగాడు. అది కాస్త ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుడిని చితకబాదే వరకు వెళ్లింది.
సదరు ప్రయాణికుడు హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా మారిందా? ఎప్పుడు వస్తాయని అడిగినందుకు బస్సు డ్రైవర్లు అతన్ని ఇంతలా చితకబాదారని తోటి ప్రయాణికులు తెలిపారు. ఇంత దౌర్జన్యమా.. ఇదేం పద్ధతి అంటూ తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం సంఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దాడి చేసిన ఆర్టీసీ సిబ్బందిపై ట్రోల్స్ కు దారి తీసింది.