Comedian Daughters : భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో కన్నా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్స్ ది అగ్రస్థానం. ఇక్కడ ఉన్నంత మంది కమెడియన్లు మరే భాషలోనూ లేరు. కమెడియన్ గా చేస్తూనే హీరోలుగా రాణించారు. విలన్లు గా మెప్పించారు.
అల్లు రామలింగయ్య నుంచి మొదలుకుంటే ఎంఎస్ నారాయణ, వేణు మాదవ్, ఏవీఎస్, బ్రహ్మానందం, అలీ ఇలా చెప్పుకుంటే పోతే వారి జాబితా పెద్దదే. ఎంతో మంది కమెడియన్లు తెరపై తమ నటనతో నవ్వులు పూయించారు. అలాంటి వారిలో రఘు కారుమంచి కూడా ఒకరు. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆదితో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ చేసిన అదుర్స్ సినిమాతో రఘు మరింత పాపులారిటీ సంపాదించాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రఘు సినిమాల్లోకి రావడానికి మాత్రం చాలా కష్టాలు పడ్డాడు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. డైరెక్టర్ వీవీ వినాయక్ తో ఉన్న పరిచయం కారణంగా ఎన్టీఆర్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తొలి సినిమా అది చిత్రంతో నవ్వులు పూయించాడు రఘు.. ఆ తర్వాత అదుర్స్ సినిమాలో తన డైలాగ్స్, మేనరిజంతో ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అగ్ర హీరోలందరితో పాటు లో బడ్జెట్ సినిమాల్లోనూ నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోనూ కొన్ని ఎపిసోడ్స్ చేశాడు. దాదాపు 200పైగా సినిమాల్లో నటించాడు రఘు. అయితే రఘు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాత్రం బయటికి రానివ్వలేదు.
రఘు కుటుంబం తెనాలికి చెందిన వారు. అయితే రఘు పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసిన రఘు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. రఘుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు స్వప్నిక, చిన్న అమ్మాయి పేరు తేజస్వీ. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రఘు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. తాజాగా తన ఫ్యామిలీ, కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.