Election Commission : రాష్ట్రంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రకాశం నుంచి పరమేశ్వర్, పల్నాడు రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జాషువా, అనంతపురం అన్బురాజన్, నెల్లూరు తిరుమలేశ్వర్, ఎస్పీలు, బదిలీ అయ్యారు.
వీరితోపాటు గుంటూరు రేంజ్ ఐజి పాలరాజునీ బదిలీ చేశారు. అలాగే ముగ్గురు ఐఏఎస్ లు, అయిదుగురు ఎస్పీల పైన చర్యలు తీసుకుంది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఎన్నికల వేళ పలువురు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారం గా ముగ్గురు ఐఏఎస్, ఐదు మంది జిల్లా ఎస్పీ లపై ఎన్నికల సంఘం బదిలీలు చేస్తూ నిర్ణయం తీసు కుంది. నేటి నుంచే ఉన్న స్థానంలో రిలీవై కేటాయిం చిన స్థానాలకు వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశా లు జారీ చేసింది.