ఎన్నో రాకెట్లు పంపడంలో ఆమె గొంతు వినిపించేది. చంద్రయాన్ -3 ప్రయోగంలో కూడా ఆమె స్వరమే వినిపించింది. కానీ ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. గుండెపోటు రావడంతో చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే ఆమె తుది శ్వాస విడిచింది. వలర్మాతి చనిపోవడంతో ఇస్రోలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇస్రో సైంటిస్ట్ వలార్మతి మరణం అందరిని కలచివేసింది.
1959లో వలర్మాతి తమిళనాడులోని అరియలూర్ లో జన్మించింది. కోయంబత్తూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచ్ లర్ ఆఫ్ ఇంజినీరింగ్, అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశారు. 1984లో ఇస్రోలో చేరారు. ఇన్ శాట్ 2ఎ, ఐఆర్ఎస్ ఐసి, ఐఆర్ఎస్ ఐడి, టెన్ తో సహా అనేక మిషన్స్ లో ఆమె ప్రధాన భూమిక పోషించారు.
2012లో విజయవంతంగా ప్రయోగించిన స్వదేశీ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రీశాట్ 1కి ఆమె ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నారు. 2015లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అబ్దుల్ కలామ్ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆమె కావడం గమనార్హం. వలార్మతి మరణించడంతో ఇస్రోలో విషాద చాయలు అలుముకున్నాయి.
ReplyForward
|