Anand Mahindra : ఆనంద్ గోపాల్ మహీంద్రా గురించి పరిచయం అవసరం లేదు. భారత్ కు చెందిన బిలియనీర్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్. మహీంద్రా అండ్ మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా మనుమడు. బడా వ్యాపార వేత్త అయిన ఆయన అప్పుడప్పుడూ రిలాక్స్ కావాలి కదా.. అందుకే అప్పుడప్పుడు సోషల్ మీడియా వైపు ఓ లుక్ వేస్తాడు. ఆయనకు నచ్చిన వీడియో, పిక్ లను షేర్ చేస్తూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంటాడు. రీసెంట్ గా ఆయన ఓ వీడియో షేర్ చేశారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం.
ఓ ప్రైమరీ టీచర్ స్టూడెంట్స్ కు క్రమ శిక్షణ నేర్పుతున్న తీరు ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఆయన ఆ వీడియోపై స్పందించారు. క్లాస్ స్ట్రాట్ అయ్యే ముందు టీచర్ కాస్త ముందుగా వచ్చి.. ప్రైమరీ స్టూడెంట్స్ కు సంబంధించి ఆట వస్తువులు, కుర్చీలు టేబుళ్లను క్లాస్ రూం నిండా చిందర వందరగా పడవేస్తుంది. ఆ తర్వాత క్లాస్ స్ట్రాట్ కాగానే స్టూడెంట్స్ వచ్చి వాటిని చూసి ఎక్కడ ఉన్నవి అక్కడ పద్ధతిగా సర్ధుతారు. ఇది చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ‘ఏం ఐడియా.. బాల్యం నుంచే పరిశుభ్రత, పచ్చదనం గురించి అలవాటు చేస్తున్నారు. మనం కూడా మన ప్రీ, ఎలిమెంటరీ స్కూల్స్ లో ఇలా చేయగలమా?’
అని ట్వీట్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైకులు పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల పిల్లలు బాల్యం నుంచి క్రమ శిక్షణ పరిసరాల పరిశుభ్రతకు అలవాటు పడతారు. ఫలితంగా ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. అయితే రోజు వారి చర్యల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ ఇలా చేయడం జరగని పని.. కానీ ప్రీ స్కూల్ లో ఇలాంటివి తరుచూ చేయిస్తే ఆరోగ్య కరమైన మంచి సమాజం ఏర్పడుతుంది.
What an idea…
This is how to embed cleanliness & tidiness & collaboration in our basic nature.
Can we make this practice a standard part of pre and elementary schools?? pic.twitter.com/APeVw4AKWL— anand mahindra (@anandmahindra) January 7, 2024