500 Notes RBI : దేశంలో రూ. 500 నోట్లకు సంబంధించిన సమాచారం ఒకటి ఆర్బీఐ వద్దనే వార్త ఇప్పుడు దేశంలో కలకం రేపుతున్నది. దాదాపు రూ. 88,032.5కోట్ల విలువైన రూ. 500 నోట్ల సమాచారం ఇదని తెలిసింది. సామాజిక కార్యకర్త మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం గతంలో పాతనోట్లను రద్దు చేసి, కొత్తవి పరిగణలోకి తెచ్చింది. దేశంలోని 3 ముద్రణలయాల నుంచి రూ. 8810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ అందులో కేవలం 7260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరినట్లు ఆర్టీఐ నివేదిక చెబుతోంది. అయితే మిగతా 1760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం తమ వద్ద లేదని ఆర్బీఐ చెప్పినట్లు సమాచారం.
ఈ అంశం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతున్నది. భారత్లో మూడు చోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ లిమిటెడ్, నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్ , మధ్యప్రదేశ్ దేవస్ లో బ్యాంక్ నోట్ ప్రెస్ లో దేశానికి అవసరమైన కరెన్సీని ముద్రిస్తారు. యఅితే 2016-17లో 1662 మిలియన్ల రూ. 500 నోట్లను ముద్రించినట్లు నాసిక్ యూనిట్ వెల్లడించింది. కాగా, ఇదే
సమయంలో 5195.65 మిలియన్లు, దేవస్ లో 1953 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. అయితే ఆర్బీఐ మాత్రం కేవలం 7260 మిలియన్ నోట్లు తమకు అందినట్లు చెబుతున్నది.
మరో ఆర్టీఐ దరఖాస్తు ప్రకారం ఏప్రిల్ 2015 డిసెంబర్ 2016 మధ్య కాలంలో నాసిక్ ముద్రాణాలయంలో 375.450 మిలియన్ల కొత్త రూ. 500 నోట్లను ముద్రించారు. కానీ ఆర్బీఐ మాత్రం 345 మిలియన్ల నోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతోంది. కనిపించకుండో పోయిన మొత్తం 1760 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లలో ఏప్రిల్ 2015 మార్చి 2016 మధ్య కాలంలో ముద్రించినట్లు తేలింది. అయితే నవంబర్ 2016 లో కేంద్రం నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ తర్వాతే కొత్త నోట్లను తీసుకొచ్చారు.
గతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన (500 Notes RBI) రూ. 500 నకిలీ నోట్ల సంఖ్యలో 14 శాతం పెరిగినట్లు వార్షిక నివేదికలో ఆర్బీ్ఐ వెల్లడించింది. మొత్తం 91,110 నోట్లను గుర్తించినట్లు చెప్పింది. కాగా, రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య 9860కి చేరినట్లు పేర్కొంది. మరోవైపు రూ. 2వేల నోట్లను కూడా వెనక్కి తీసుకుంటూ మే 19 న ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోగా రూ. 2వేల నోట్లను బ్యాంకుల్లో వెనక్కి ఇవ్వాలని కోరింది.