మే 5న తొలి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో కొన్ని గ్రహాలకు కష్టాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రాశులపై ప్రభావం చూపనుంది. చంద్రగ్రహణం మే 5న రాత్రి 8.44 గంటల నుంచి రాత్రి 1.01 గంటల వరకు ఉంటుంది. దీని వల్ల నాలుగు రాశులపై ప్రతికూలతలు కలిగించనుంది. దీని వల్ల ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు రావచ్చు.
వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. ఏ పని చేసినా ముందకు వెళ్లదు. మే 5న ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువగా వస్తాయని చెబుతున్నారు. దీంతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి కూడా ఇబ్బందులు వస్తాయి. చంద్రగ్రహణం తరువాత వీరు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిందే. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ఏ పని చేపట్టినా ముందుకు వెళ్లదు. ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు కొన్ని పరిహారాలు పాటిస్తే సరి.
మిథున రాశి వారికి చంద్రగ్రహణం వల్ల తీవ్ర ప్రభావాలు చూపుతోంది. ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. అనుకోని కష్టాలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల వీరికి కష్టాలు పలకరించనున్నాయి. కొత్త పనులు చేపట్టడం మంచిది కాదు. వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే వీరికి మంచి జరుగుతుంది. ఎటు కూడా ముందుకు వెళ్లకపోవడమే బెటర్.
కన్యా రాశి వారు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటారు. చంద్రగ్రహణం వీరికి కూడా ఇబ్బందులు తెస్తోంది. దాదాపు 15 రోజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. డబ్బులు పెట్టే ఏ పనికి కూడా మొగ్గు చూపకూడదు. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉంటే అన్ని కుదుట పడతాయి. చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశులను బాధలకు గురి చేయనుంది.