29.3 C
India
Tuesday, February 10, 2026
More
    Home Blog

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala
    Tirumala

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మే 23 నుంచి 29 వరకు 5.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, టీటీడీకి హుండీ ద్వారా రూ. 25.53 కోట్ల ఆదాయం లభించింది. ఈ సమయంలో 2.5 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణలో టీటీడీ విశేష సేవలు అందించింది.

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna
    Balakrishna

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ నటుడు మురళీ మోహన్‌ ప్రకటించారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రకటించారు.

    ఇతర అవార్డు గ్రహీతలు ఇలా ఉన్నాయి: విజయ్‌ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్‌ అవార్డు, ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి-చక్రపాణి ఫిల్మ్‌ అవార్డు, సుకుమార్‌కు బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు ప్రకటించారు.

    ప్రత్యేక జ్యూరీ అవార్డు ప్రజాకవి, దివంగత కాళోజీ నారాయణరావుకు ప్రకటించారు.

    గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

    2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం

    2014 ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
    2015 ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
    2016 ఉత్తమ చిత్రం – శతమానం భవతి
    2017 ఉత్తమ చిత్రం – బాహుబలి కంక్లూజన్
    2018 ఉత్తమ చిత్రం – మహానటి
    2019 ఉత్తమ చిత్రం – మహర్షి
    2020 ఉత్తమ చిత్రం – అల వైకుంఠపురంలో
    2021 ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
    2022 ఉత్తమ చిత్రం -సీతారామం
    2023 ఉత్తమ చిత్రం – బలగం

    స్పెషల్ జ్యూరీ అవార్డు – ప్రజాకవి కాళోజీ

    బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు

    గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

    విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు

    మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు

    అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు

    సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు.

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులపై 10 వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసినందుకు ఆయనపై ఎన్‌ఐఏ చర్యలు తీసుకుంది.

    అరెస్టుకు కారణాలు:

    సన్నీ యాదవ్ “పాక్‌లో మొదటిరోజు” అంటూ ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోను పరిశీలించిన ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన అనంతరం భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరుతో పాక్‌పై దాడికి దిగిన సమయంలో సన్నీ యాదవ్ పాకిస్తాన్‌కు వెళ్లడం, అక్కడి వీడియోలు పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    సన్నీ యాదవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయంగా చర్చలకు దారి తీశాయి. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని, వాటితో డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే ఈ వీడియోలను తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 10 వీడియోలపై ఎన్‌ఐఏ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

    గత సంఘటనలు, అనుమానాలు:

    హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను గతంలో పాకిస్తాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందని ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు (ISI) తమ అస్త్రంగా మలచుకున్నారని హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్‌లో ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌లో పలుమార్లు పర్యటించారని, ఓసారి చైనాకూ కూడా వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు.

    ఇదే తరహాలో బయ్యా సన్నీ యాదవ్‌కు కూడా పాక్ అధికారులతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో, ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu
    Chandrababu

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా మహానాడు చివరి రోజున చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన ప్రసంగంలో ఆయన విపరీతమైన ధీమాతో మాట్లాడుతూ, రాజకీయాల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వారిపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.

    ఆర్థిక ఉగ్రవాదులపై విమర్శలు

    ‘‘ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ముసుగులో రాష్ట్రాన్ని దోచేశారు. ల్యాండ్, శాండ్, మైన్స్ అన్నింటినీ లూటీ చేశారు. కొండలు మింగేశారు, చెరువులు చెరబట్టేశారు. ఇదంతా చూస్తూ ఊరుకునేది కాదు. ఇకపై ‘ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్’ ప్రారంభిస్తా. ఈ తరహా నేతలను రాజకీయాలనుండి బహిష్కరిస్తా’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    ఈ వ్యాఖ్యలు స్పష్టంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు ఇప్పటికే ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుండగా, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చాయి.

    ఎన్నికల నజీరా?

    ఇటీవలి ఎన్నికల పోలింగ్ అనంతరం మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంగా భావించవచ్చు. ప్రజలు తమ తీర్పు చెప్పిన తరుణంలో, తన తదుపరి కార్యాచరణకు ఇది మౌలికాంశంగా ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా “ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్” అనే పద ప్రయోగం, తన పాలనకు వ్యతిరేకంగా అవినీతి, అక్రమాల పాలకులను తరిమికొట్టేందుకు ఒక శుభసంకల్పంగా చెప్పవచ్చు.

    వైసీపీ ఎలా స్పందిస్తుందీ?

    చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఇంకా అధికారికంగా స్పందించకపోయినప్పటికీ, పార్టీలో కలకలం రేగినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఇలాంటి హెచ్చరికలు చేయడం చంద్రబాబు ధైర్యాన్ని చూపించిందా, లేక వ్యూహాత్మక ఒత్తిడిగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది.

    చంద్రబాబు ‘వార్నింగ్’ ఇప్పుడే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినా, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో త్వరలో తేలనుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ వ్యాఖ్యలు మరింత బలంగా మారతాయా, లేక కేవలం ఎన్నికల ప్రచార భాషణంగా మిగిలిపోతాయా అన్నది ప్రజల తీర్పే నిర్ణయిస్తుంది. అయితే, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది – ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే రోజులు మరింత ఉత్కంఠతో కూడుకున్నవిగా ఉండబోతున్నాయి.

    Bhairavam : ‘భైరవం’ మూవీ రివ్యూ

    Bhairavam Review : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం ఓ మోస్తరైన కమర్షియల్ రీమేక్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్‌లోని ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. కానీ మ్యూజిక్, ఇల్లాజికల్ సీన్స్ సినిమాను వెనక్కి లాగాయి. నటుల పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించినా, టెక్నికల్ గాబడులు స్పష్టంగా కనిపిస్తాయి.

    రేటింగ్: 2.25/5

    ఫైనల్ వెర్డిక్ట్: ఫ్యామిలీ డ్రామా విత్ మిక్స్డ్ రిజల్ట్.

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi
    Chiranjeevi

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డుల సంప్రదాయాన్ని పునరుద్ధరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.‘‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనది.

    సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడు, టెక్నీషియన్‌కు ఎంతో ప్రేరణనిస్తుంది. అద్భుతమైన సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించటం, ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధితశాఖ మంత్రులు, అధికారులకు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

    NIA custody : ఎన్ఐఏ అదుపులో యూట్యూబర్ సన్నీ యాదవ్

    NIA custody : ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

    ఇటీవల సన్నీ యాదవ్ తన బైక్‌పై పాకిస్తాన్‌ టూర్‌కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టూర్‌కు సంబంధించిన అనుమానాస్పద అంశాలపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. పాక్ టూర్‌లో ఆయన ఎవరెవరిని కలిశారు? ఏ ప్రాంతాలకు వెళ్లారు? టూర్ వెనక ఉన్న ముళ్ళు ఏమిటన్న కోణాల్లో ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

    సన్నీ యాదవ్ ఒక ట్రావెల్ వ్లాగర్‌గా సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందారు. అయితే అంతర్జాతీయ ప్రయాణాల్లో ఉన్న భద్రతా పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ విచారణ చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

    Kavitha : కవిత కొత్త పార్టీ: జగన్ మాస్టర్ మైండ్, కేసీఆర్ వ్యూహం?

    Kavitha : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు, ఆ పార్టీ వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉందనే వాదనలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చర్చకు బలం చేకూరుస్తున్న మరో అంశం – వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, దాని వెనుక జగన్ వ్యూహం.

    షర్మిల విషయంలో జగన్ వ్యూహం – ఒక ఉదాహరణ:

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వై.ఎస్. షర్మిల వ్యవహారం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు ఒక చక్కటి ఉదాహరణ. వైసీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళకుండా, కాంగ్రెస్ పార్టీకి మళ్ళించేలా షర్మిలను కాంగ్రెస్ లోకి పంపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తద్వారా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలి, టీడీపీకి పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరకుండా చేయగలిగారని పలువురు నమ్ముతారు. ఈ వ్యూహం జగన్ రాజకీయ చతురతకు నిదర్శనంగా మారింది.

    కవిత పార్టీ వెనుక కేసీఆర్ – జగన్ వ్యూహం అనుసరణ?

    ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని తెలంగాణలో కేసీఆర్ అనుసరిస్తున్నారని, కవిత కొత్త పార్టీ పెట్టడం వెనుక ఇదే ఆలోచన ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీకి వ్యతిరేక ఓట్లు గణనీయంగా పెరిగాయి. ఈ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీలు తమ ఖాతాలో వేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, కవిత కొత్త పార్టీని స్థాపించి, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను, ముఖ్యంగా కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న ఓట్లను తమ పార్టీకి మళ్ళించుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీలను దెబ్బకొట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

    ఈ వ్యూహం విజయవంతమైతే, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలి, ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా పోవడం వల్ల కేసీఆర్ కు భవిష్యత్తులో రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ కు దూరమైన ఓటు బ్యాంకును తిరిగి దగ్గర చేసుకోవడానికి, లేదా కనీసం చీల్చడానికి కవిత పార్టీ ఒక వేదికగా ఉపయోగపడవచ్చు.

    జగన్ మాస్టర్ మైండ్ – కేసీఆర్ అనుసరణ?

    కవిత కొత్త పార్టీ వెనుక జగన్ మాస్టర్ మైండ్ ఉందనే వాదనకు బలం చేకూరుస్తున్న అంశం ఏమిటంటే, షర్మిల విషయంలో జగన్ అనుసరించిన వ్యూహం. కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా షర్మిల వైసీపీకి పరోక్షంగా లాభం చేకూర్చినట్లుగా, కవిత కొత్త పార్టీ కూడా బీఆర్ఎస్ కు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఈ వ్యూహం జగన్ యొక్క దీర్ఘకాలిక ఆలోచనలకు, రాజకీయ చతురతకు నిదర్శనం.

    మొత్తం మీద, కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపుకు దారితీసే అవకాశం ఉంది. ఈ పార్టీ వెనుక జగన్ మాస్టర్ మైండ్, కేసీఆర్ వ్యూహం ఎంతవరకు పని చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. అయితే, ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలను మార్చేసే శక్తిని కలిగి ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.

    Digvesh : దిగ్వేశ్‌ రాఠి నోట్‌బుక్‌ సంబరాలు ఎందుకంటే..!

    Digvesh
    Digvesh

    Digvesh : లఖ్‌నవూ లెగ్‌ స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠి మాత్రం ఈ సీజన్‌పై తనదైన ముద్ర వేశాడు. 12 మ్యాచ్‌ల్లో 14 వికెట్లతో రాణించిన దిగ్వేశ్‌ తీవ్ర చర్చనీయాంశం అయ్యాడు. వికెట్‌ తీసినప్పుడల్లా నోట్‌బుక్‌లో రాసుకుంటున్నట్లు దిగ్వేశ్‌ సంబరాలు చేసుకోవడం.. అప్పుడప్పుడూ అవి శ్రుతిమించడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు రూ.9.37 లక్షల జరిమానా కట్టిన దిగ్వేశ్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అభిషేక్‌శర్మతో మాటల యుద్ధం కారణంగా ఒక మ్యాచ్‌లో సస్పెండ్‌ కూడా అయ్యాడు. ఈ నోట్‌బుక్‌ సంబరాలేంటన్న ప్రశ్నకు గతంలో ఒక అభిమానికి స్వయంగా దిగ్వేశ్‌ బదులిచ్చిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ‘‘ఎప్పుడు టోర్నీ జరిగినా.. నోట్‌బుక్‌ తీసుకెళ్తా. అందులో అందరి పేర్లు రాసుకుంటా’’ అని దిగ్వేశ్‌ సమాధానమిచ్చాడు. అంటే.. మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లందరి పేర్లు దిగ్వేశ్‌ రాసుకుంటాడు. తన బౌలింగ్‌లో ఔటైన ఆటగాడి పేరుపై గీత గీస్తాడు. తన ప్రదర్శనను భద్రపరుచుకోవడంతో పాటు ఫలానా ఆటగాడిని ఔట్‌ చేశానని రికార్డు చేసుకోవడమే నోట్‌బుక్‌ ఉద్దేశం.

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ, చిత్రం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో నిర్మాత AM రత్నం మాట్లాడుతూ, “నటనతో పాటు సినిమాటిక్ క్రాఫ్ట్ మీద పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లాంటి కొంతమంది మాత్రమే పట్టు కలిగి ఉంటారు” అన్నారు. పవన్ టెక్నికల్ విభాగాల్లోనూ ఎంతో పరిజ్ఞానం కలవాడని ప్రశంసించారు.

    అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నిర్మాత AM రత్నం సినిమా పట్ల ఉన్న అపారమైన ప్యాషన్‌ను కొనియాడుతూ, “ఆయన సెట్స్‌లో మొదటివాడిగా వచ్చి, చివరివాడిగా వెళ్తాడు. అంత కృషి చేసే నిర్మాతను నేను చూడలేదు” అని వ్యాఖ్యానించింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.