34 C
India
Friday, April 26, 2024
More
    Home Blog

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results
    Twins Inter Results

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో చదువుతున్న కవలలు (అక్కా చెల్లెళ్లు) ప్రతిభ చూపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ అక్కాచెల్లెళ్లు శార్వాని, ప్రజ్ఞాని చదువుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో శార్వాణికి ఎంపిసి లో 470 మార్కులకు గానను 465 మార్కులు వచ్చాయి. ప్రజ్ఞానికి బైపీసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు వచ్చాయి. దీంతో శార్వాని, ప్రజ్ఞానిలను కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ అభినందించారు.

    ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో పాటు ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ, గురుకుల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలను మించి ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి.

    ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లోనూ వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. ఈ కళాశాల ప్రథమ సంవత్సరంలో 45.37 శాతం, ద్వితీయ సంవత్సరంలో 66.37 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.

    BRS-Congress : అప్పుడు బిఆర్ఎస్ వేస్తె.. ఇప్పుడు కాంగ్రెస్ వేసింది

    BRS-Congress
    BRS-Congress

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఆరోపించింది.విభజన తరువాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు,హక్కులను  ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తోందని గులాబీ అధినేత కేసీఆర్ తోపాటు ఆయన మంత్రి వర్గం మోది ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సమానంగా అధికారంలో ఉన్నారు.రాష్ట్ర పర్యటనకు కేంద్ర మంత్రులు వచ్చిన సందర్భాల్లో గులాబీ నాయకులు పోస్టర్లు విడుదల చేస్తూ నిరసన తెలిపే సంస్కృతి కనపడేది. రాష్ట్రంలో ఎక్కడికి బీజేపీ కేంద్ర మంత్రులు వచ్చినా పోస్టర్లు వెలిసేవి. చివరకు మోదీ పర్యటనకు వస్తే కూడా స్వాగతం చెప్పడానికి ముఖ్యమంత్రి వెళ్లకపోయేది.ఆ విదంగా గులాబీ పరిపాలన హయాంలో బీజేపీ కేంద్ర మంత్రులకు పోస్టర్లతో నిరసన కనపడేది. తెలంగాణకు ప్రధాన మంత్రి ఏమిచేసాడు. తీరని అన్యాయం చేసాడు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు.నిధులు ఇవ్వడంలేదు.కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన దానికంటే,మనమే పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు ఎక్కువగా ఇస్తున్నామంటూ ఆరోపణలు చేసేది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్.

    తాజాగా కాంగ్రెస్ కూడా బిఆర్ఎస్ బాటలోనే నడుస్తోందా అనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.ఇటీవల మోది ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేయడంతో ఈ అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.ఒకరు చేసిందే వీళ్ళు చేస్తే ఫలితం ఏముంటది అనే  చర్చ కూడా జరుగుతోంది.కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే ఏంతో కొంత ఉపయోగం జరుగుతుంది కానీ పథ పద్ధతుల్లో నీరసన కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో అప్పటికి,ఇప్పటికి తేడా ఉందనే అభిప్రాయాలూ సైతం వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై పోస్టర్లు విడుదల చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. బీజేపీ హిందూ – ముస్లిం రాజకీయం చేస్తోంది. దీనికి సరిపడే సమాధానం కాంగ్రెస్ వద్ద లేదు.ఫలితం లేని రాజకీయ ఆలోచనలను పక్కకు పెట్టి, మేలుచేసే కొత్త ఆలోచన విధానంతో రాజకీయంగా బిజెపి ని ఆదుకోవడమే సరైన విధానమనే అభిప్రాయాలూ సైతం వ్యక్తమవుతున్నాయి.

    Pawan Kalyan : అధికారం వద్దు… సినిమానే ముద్దంటున్న పవన్ కళ్యాణ్

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూటమిగా ఏర్పడ్డాయి. జనసేన అధినేత,ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.నామినేషన్ పత్రంలో ఆయన బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు, చిరంజీవి భార్య సురేఖతోపాటు పలువురి వద్ద తీసుకున్న అప్పుల వివరాలను ఎన్నికల కమిషన్కు తెలిపారు.

    తీసుకున్న అప్పుల్లో కూడా పలు నిర్మాణ సంస్థల వద్ద తీసుకున్నట్టు సమాచారం. సినీ నిర్మాణ సంస్థల వద్ద ముందస్తుగా తీసుకున్న అప్పులు ఆ సంస్థలతో సినిమా చేయడానికే తీసుకున్నట్టు సమాచారం. ఒకవైపు రాజకీయం,మరోవైపు నటన తో పవన్ కళ్యణ్ తీరిక లేకుండా గడుపుతున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి కూటమి వస్తుంది.పవన్ కళ్యాణ్ గెలిస్తే ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశాలు  తక్కువగా కనబడుతున్నాయి.

    ఇప్పటికే పలు సినిమా షూటింగ్ లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్దని ఇంటికి పంపాలనే పట్టుదలతో సినిమా షూటింగ్ లకు కొంత కాలం దూరం ఉందామని నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల ఫలితాలు రావడం, ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమాలు ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ కెమెరా ఎం ముందు వాలే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.

    సినిమా షూటింగ్ లతో ఆయన కనీసం రెండేళ్లకు పైగా తీరికలేకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్నిక ల ఖర్చు కోసం పలు నిర్మాణ సంస్థల వద్ద ముందుగానే కొంత సొమ్ము తీసుకొని వాటిని ఎన్నికల అఫిడవిట్ లో అపురూపంగా చూపించినట్టు రాజకీయ వర్గాలతోపాటు, సినీ ఇండస్ట్రీలో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అధికారంలో భాద్యతలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

    ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.ఒప్పుకున్న సంస్థల వద్ద కూడా ఈపాటికే కొంత పైకం తుసుకొని ఉంటారు. కాబట్టి గతంలో ఒప్పుకున్నవి, ఇటీవల అడ్వాన్స్ తీసుకున్న నిర్మాణ సంస్థల వద్ద అగ్రిమెంట్ చేసుకున్న సినిమాలు షూటింగ్ పూర్తయ్యే వరకు రాజకీయాలకు దూరంగా ఉంటారు.అంటే అధికారంలో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ  జరుగుతోంది.

    Weather Report : 28 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు

    Weather Report
    Weather Report

    Weather Report : తెలంగాణలో ఈ నెల 28 నుంచి వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 28, 29, 30 తేదీల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలుు వీస్తాయని పేర్కొంది. మరో 5 రోజులపాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

    ఈ నెల 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామాPPరెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada
    Canada

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల విదేశాల్లో ఉద్యోగం చేయడం. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం చేయాలని తహతహలాడుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఇదే ఆలోచనగా ఉంటారు. ‘‘తమ వాడు అమెరికాలో ఉన్నాడు..తమ అమ్మాయి కెనడాలో ఉంది..’’ అని చుట్టాలతో చెప్పుకోవడానికి గర్వపడుతుంటారు. పిల్లలను విదేశాల్లో స్థిరపడేలా చేసేందుకు స్థోమత లేకపోయినా లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. భారత్ లో పుట్టిన సగటు తల్లిదండ్రుల ఆలోచన అంతా ఇదే.

    అయితే కెనడా, అమెరికాల్లో పరిస్థితులు బాగోలేవని కెనడాలో 25 సంవత్సరాల కిందట సెటిల్ అయిన ఓ తెలుగు వ్యక్తి ఓ వీడియో ద్వారా విన్నవించగా..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే..‘‘నేను కెనడాలో పడని కష్టం లేదు. జీరో నుంచి హై పొజిషన్ లో ఉన్నాను. అయితే ప్రస్తుతం కెనడాలో ఉద్యోగాలు లేవు. రెఫరెన్స్ తో కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అలాగే లివింగ్ కాస్ట్, నిత్యావసర సరుకుల ఖర్చులు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతున్నాయి. పేద, మధ్య తరగతి భారత తల్లిదండ్రులు మీ పిల్లలను కెనడా, అమెరికాకు పంపించవద్దు. వీటి కంటే యూకే మోస్తారుగా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

    కెనడా ప్రధాని ట్రూడో చేసిన పనుల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని సదరు వ్యక్తి ఆ వీడియోలో గోడు వెల్లబోసుకున్నాడు. విపరీత వలసల వల్ల కెనడాలో ఉద్యోగాలు పోతున్నాయని, ఈ విషయంపై సీరియస్ గా పట్టించుకోవాలని కెనడా రాజకీయ నాయకులకు సూచించారు. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేవన్నారు. కెనడా మార్కెట్ డెడ్ అయ్యిందని చెప్పారు. కెనడాలో ఉద్యోగం చేద్దామనుకునే భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితువు పలికారు.

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    IPL 2024 Today
    IPL 2024 Today Match

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో 42 వ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. కోల్ కతా ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి అయిదింట్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. పంజాబ్ ఎప్పటిలాగే ఈ సీజన్ లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింట్లోనే గెలిచింది.

    పంజాబ్ కు తాత్కాలికంగా సామ్ కర్రన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. లివింగ్ స్టన్ ఫామ్ కోల్పోవడం పంజాబ్ కు తీవ్రంగా దెబ్బతీస్తోంది. సామ్ కర్రన్, లివింగ్ స్టన్, బౌలర్ రబడా తమ స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్ లో అయితే యువ సంచలనాలు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది.

    కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం మంచి ఊపు మీద ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్రీ రస్సెల్ కూడా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. మిచెల్ స్టార్క్ గత మ్యాచ్ లో గాయపడ్డాడు. ప్రస్తుతానికి అందుబాటులో ఉంటాడా.. లేదా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇప్పటి వరకు మిచెల్ స్టార్క్ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో మూడు సిక్సులు ఇచ్చి మ్యాచ్ పోగొట్టినంత పని చేశాడు.

    శిఖర్ దావన్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది ఇంకా ఏదీ తేలలేదు. పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మేం అన్ని మ్యాచ్ లు గెలవాల్సిందే. మాకు వేరే అప్షన్ లేదని చెప్పాడు. పంజాబ్ అశుతోష్ శర్మ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కోల్ కతా బ్యాటింగ్ లో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు చూస్తే ఈ మ్యాచ్ లో కోల్ కతానే ఫేవరేట్ అని గణాంకాలు చెబుతున్నాయి.

    SRH VS RCB : సన్ రైజర్స్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    SRH VS RCB
    SRH VS RCB

    SRH VS RCB : సన్ రైజర్స్ విజయాలకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పటిదార్ కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సులతో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ స్పిన్నర్లను టార్గెట్ గా చేసుకుని సిక్సులు బాదాడు.

    విరాట్ కోహ్లి కూడా అర్థ సెంచరీతో రాణించాడు. విరాట్ మొదట స్పీడ్ గా ఆడిన తర్వాత స్లో అయ్యాడు. సన్ రైజర్స్ మొదట స్పిన్ తో బౌలింగ్ ప్రారంభించింది. అభిషేక్ శర్మ మొదటి ఓవర్ లో 10 పరుగులు సమర్పించుకున్నాడు. జై దేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కు ఒక్క ఓవర్ మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.

    అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు చేసిన హెడ్ విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆర్సీబీ ప్రయోగం విల్ జాక్స్ రూపంలో ఫలించింది. లెఫ్ట్ హ్యండ్ బ్యాటర్ కు రైట్ ఆర్మ్ స్పిన్ తో బౌలింగ్ చేయించిన డుప్లెసిస్ హెడ్ ను బుట్టలో వేసే ప్లాన్ సక్సెస్ అయింది. తర్వాత అభిషేక్ శర్మ మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది గత మ్యాచ్ ఊపు కొనసాగించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 31 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కమ్, క్లాసెన్, నితిశ్ రెడ్డి, సమద్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

    అయితే షాబాద్, కమిన్స్ కాస్త జోరు ప్రదర్శించిన అది స్కోరు బోర్డుపై అంతరం తగ్గించేందుకు మాత్రమే పనికొచ్చింది. కమిన్స్ మూడు సిక్సులు బాది 15 బంతుల్లోనే 31 పరుగులు చేసినా ఆ తర్వాత ఔట్ కావడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. చివరి వరకు క్రీజులో ఉన్న షెహబాజ్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ రాణించి సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 171/8 తో ఇన్సింగ్స్ ను ముగించింది. ఆర్సీబీకి ఆరు మ్యాచ్ ల తర్వాత ఓ విజయం దక్కడం ఊరట కలిగించింది.

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan
    YS Jagan

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట బహిరంగ సభలు, 22 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరిట బస్సుయాత్ర నిర్వహించిన ఆయన మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రారంభం కానున్న ప్రచార సభల్లో  ప్రతిరోజూ 3 సభల్లో పాల్గొననున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైఎస్సార్సీపీ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సభల్లో తన పాలనలో జరిగిన అభవృద్ధిని, సంక్షేమ పథకాలతో చేకూరిన లబ్ధిని వివరిస్తూనే.. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి.

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu
    Avian flu

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు, పక్షులకు సోకే ఈ వ్యాధి మనుషులకు కూడా మనుషులకూ వ్యాప్త చెందుతుంది. చికెన్, మటన్ ద్వారా ఇది మనుషులకు సోకే ప్రమాదం పొంచి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రాంచీలో కోళ్ల ఫాంలలో కోళ్లకు ఈ వ్యాధి సోకింది. హోత్వారాలోని రీజనల్ పౌల్ట్రీఫాంలో వేలాది కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. గుడ్లను కూడా బయటపడేశారు. ఏవియన్ ఫ్లూ అని పిలువబడే ఈ వైరస్ ను మానవులలో వేగంగా వ్యాప్తి చెందే మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.

    ఏవియన్ ఫ్లూ వైరస్ రకరకాలుగా ఉంటుంది. H5N11, H7N9 ఇన్ ఫ్లూయెంజా ఈ వైరస్ లోని ఉపరకాలు. వైరస్ ఉపరితలంపై ఉండే ప్రోటీన్ల రకాలను బట్టి వీటి పేర్లు పెట్టారు. ఏవియన్ ఫ్లూ (బర్డ్ ఫ్లూ) వైరస్ ను గొంతు, ముక్కు శ్లేష్మాన్ని పరీక్షించి నిర్ధారిస్తారు. ఈ వైరస్ ను ముందుగా గుర్తించినట్లయితే యాంటీ వైరల్ మందులతో చికిత్స చేస్తారు. ఏవైనా లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength
    Jagan Strength

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు తమదే అంటూ ప్రధాన పార్టీలు ధీమాగా ముందుకు సాగుతున్నాయి.  ఇక ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో  ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన చిన్న గాయమైంది. దానికి బ్యాండేజ్ వేయించుకుని ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఆయన గాయం మానలేదా? అని ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

    జగన్ కు అదృష్టవశాత్తు స్వల్ప గాయమైందని, లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది అంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. అయితే గాయం తగిలి రెండు వారాలు దగ్గరకొస్తున్నా ఇంకా చిన్న గాయం మానలేదా? ఇంకా బ్యాండేజ్ తోనే జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తుండడం ఏంటని అంటున్నారు. గాయం తీవ్రత తగ్గకపోవడంతోనే బ్యాండేజ్ తీయలేదా? లేదంటే సానుభూతి కోసమే బ్యాండేజ్ డ్రామా ఆడుతున్నారా? అంటూ జనాల్లో చర్చ జరుగుతోంది.

    ఇలా ఆ చిన్న గాయానికి ఇంకా ఎన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటారని.. ఎన్నికల పోలింగ్ అయ్యేదాక బ్యాండేజ్ తీయరా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో కోడికత్తి డ్రామాతో సానుభూతి పొందిన జగన్..ఇప్పుడు కూడా గులకరాయి దెబ్బ ఘటనతో సానుభూతి పొందేందుకే కట్టు తీయడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ బలం మ్యానిఫెస్టోనో.. అభివృద్ధో కాదని..జగన్ బ్యాండేజే అంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

    జనాలను అంత తక్కువ అంచనా వేస్తే ఎలా సామి? అని కామెంట్ చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, చాలా తెలివిగల వాళ్లు అని అంటున్నారు. ఎప్పుడు ఎవరిని గద్దె ఎక్కించాలో..ఎప్పుడు ఎవరిని గద్దె దించాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతున్నారు. జగన్ చిన్న గాయానికే రెండు వారాల పాటు బ్యాండేజ్ వేసుకున్నారని.. రేపటి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే కోలుకోవడం కష్టమేనని అంటున్నారు.